Tuesday, September 17, 2024

Karnataka: సీఎం సిద్ధరామయ్యపై విచారణకు గవర్నర్ అనుమతి..

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై విచారణకు గవర్నర్ అనుమతిచ్చారు. ముడా స్కాం కర్ణాటక సర్కార్‌ను కుదిపేస్తోంది. మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా)లో జరిగిన కుంభకోణానికి సంబంధించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఎట్టకేలకు అనుమతి ఇచ్చారు.

దీంతో సీఎం సిద్ధరామయ్య న్యాయ పోరాటంపై సమాలోచనలు చేస్తున్నారు. ప్రాసిక్యూషన్‌కు ఇచ్చిన ఉత్తర్వుల అధికారిక కాపీ ఇంకా సీఎంకు చేరలేదు. అందిన తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై న్యాయ నిపుణులతో సీఎం సిద్దరామయ్య చర్చలు జారుతున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement