Wednesday, October 2, 2024

TG | మూసీ నిర్వాసితులకు గుడ్ న్యూస్.. డబుల్‌ బెడ్‌రూమ్‌, ఇంకో సాయం!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : మూసీ నిర్వాసితులకు రేవంత్‌ సర్కార్‌ తీపి కబురు అందించింది. వారికి డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇంటితోపాటు రూ.25,000 ఆర్థిక సాయాన్ని అందించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ ప్రకటన విడుదల చేశారు. సీఎం ఆదేశాలతో ప్రభుత్వం నిర్వాసితుల పక్షాన నిలుస్తోంది.

వారికి డబుల్‌ బెడ్‌రూం ఇండ్లతోపాటు తక్షణ సాయం అందజేత దిశగా సర్కార్‌ నిర్ణయించింది. ఈ చర్య బాధితులకు కొంత ఉపశమనంగా మారనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదివరకే సామాన్యులపై కొంత ఉదారత చూపిన ప్రభుత్వం ఇకపై పునరావాసానికి పస్రాధాన్యతనిచ్చి వారికి ఆశ్రయం కల్పించేందుకు, ఆర్థికంగా ఆదుకునేందుకు యోచిస్తోంది.

రాష్ట్ర రాజకీయాల్లో హైడ్రా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కేవలం పేద వారి ఇళ్లను టార్గెట్‌ చేస్తూ బడాబాబుల ఇళ్ల కూల్చివేతలను వదిలేస్తున్నారని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా రేవంత్‌ సర్కార్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ నది సుందరీకరణ కార్యక్రమానికి అడ్డంకులు తగులుతున్నాయి.

మూసీ నది నిర్వాసితులు పెద్ద ఎత్తున ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. మరోవైపు ఎలాగైనా మూసీ నది సుందరీకరణ చేసి తీరుతామని రాష్ట్ర ప్రభుత్వం పట్టు-పడుతోంది. హైడ్రాకు సర్వాధికారాలు కట్టబెడుతూ తెచ్చిన ఆర్డినెన్స్‌కు ఆమోదం దక్కడంతో హైడ్రా మరింత బలం సంతరించుకోనుంది.

నిర్వాసితులందరికీ డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్లు

- Advertisement -

మూసీ నిర్వాసితులందరికీ డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు ఇచ్చి పునరావాసం కల్పిస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ క్రమంలో 15 వేల డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను మూసీ రివడ్‌ బెడ్‌, బఫర్‌ జోన్‌లలో నివసిస్తున్న కుటు-ంబాల పునరావాసానికి రాష్ట్ర సర్కార్‌ కేటా యించింది.

రివర్‌ బెడ్‌లో ఉన్న నిర్మాణాలకు సంబంధించి పునరావాస కార్యాచరణ కోసం సంబంధిత జిల్లా కలెక్టర్లు మార్గదర్శకాలు రూపొం దించుకోవాలని సూచించింది. నిర్వాసితులకు డబులు బెడ్‌ రూం ఇళ్లు కేటాయించి పునరావాసం కల్పించిన తర్వాతే ఈ నిర్మాణాల తొలగింపు కార్యక్రమం ప్రారంభిస్తామని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement