Friday, October 18, 2024

Godavari Pushkaras – ఏపీకి 100 కోట్లు … తెలంగాణ‌కు గుండు సున్నా

గోదావరి పుష్కరాలపై ఎందుకీ వివ‌క్ష‌
కేంద్రంపై మాజీ మంత్రి హరీశ్ ఆగ్ర‌హం
ఇద్ద‌రు కేంద్ర మంత్రులున్నా ఏం సాధించ‌లేదు
మ‌రోసారి మొండిచెయ్యి చూపార‌ని విమ‌ర్శ‌లు
హక్కుగా రావాల్సిన వాటిపైనా వివక్షలేనా?

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్‌: కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మరోసారి మొండి చేయి చూపిందని మాజీ మంత్రి త‌న్నీరు హరీష్ రావు ఫైర్ అయ్యారు. గోదావరి పుష్కరాల కోసం ఆంధ్రప్రదేశ్‌కు ₹100 కోట్లు ఇచ్చి, తెలంగాణకు మాత్రం గుండుసున్నా మిగిల్చిందని.. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులున్నా, రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా సాధించలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు హక్కుగా రావాల్సిన నిధుల కోసం పోరాటం చేయడంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయిని అన్నారు. లోక్‌సభలో బీఆర్‌ఎస్‌ ఉండి ఉంటే, ఇలాంటి అన్యాయం జరిగేది కాదని తెలిపారు.

- Advertisement -

కేంద్ర బడ్జెట్​లోనూ ఇదే తీరు..

కేంద్ర బడ్జెట్లోనూ తెలంగాణకు సున్నా కేటాయింపులు చేసి, ఏపీకి అడిషనల్ గ్రాంట్ కింద 15,000 కోట్లు ఇచ్చారని హరీశ్​రావు అన్నారు. ‘‘ఆంధ్రప్రదేశ్​కు నిధులు ఇచ్చారని మా బాధ కాదు, తెలంగాణకు అన్యాయం జరుగుతోందనేదే మా ఆవేదన అని హరీష్ స్పష్టం చేశారు. నిధుల కేటాయింపులో తెలంగాణకు మొదటి నుండి కేంద్ర ప్రభుత్వం మొండి చెయ్యే చూపుతోందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంపై ఇంత వివక్ష ఎందుకు? అని ప్రశ్నించారు. తెలంగాణను ఇతర రాష్ట్రాలతో సమానంగా చూడాలని, హక్కుగా రావాల్సిన నిధులను కచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement