Friday, October 18, 2024

Global Leader ప్రధాని మోడీ మరో అరుదైన ఘనత !

అంతర్జాలంలో ప్రధాని మోడీ కొత్త ట్రెండ్‌ సృష్టిస్తున్నారు. ఆయన యూట్యూబ్‌ ఛానల్‌లో సబ్‌స్క్రైబర్ల సంఖ్య రెండు కోట్లు దాటింది. మంగళవారం ఈ అరుదైన రికార్డును నెలకొల్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాధినేతలు అత్యధిక సంఖ్యలో మోడీకి యూట్యూబ్‌ ఖాతాదారులుగా ఉన్నారు. ప్రభుత్వ యూట్యూబ్‌ ఛానల్‌లో ప్రధాని తన వీడియోలను తరచూ పోస్టు చేస్తుంటారు. ఆ వీడియోలను సుమారు 450 కోట్ల మంది ఇప్పటికే వీక్షించారు.

ఈ విషయంలో ప్రపంచ నేతల్లో ఎవరు కూడా ఆయన దరిదాపుల్లోలేరు. బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు జెయిర్‌ బొల్సనారో సబ్‌స్క్రైబర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. ఆయనకు 64 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు మాత్రమే ఉండగా, వ్యూవ్స్‌ విషయంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలన్‌స్కీ రెండో స్థానంలో నిలిచారు. ఆయన వీడియోలకు 22.4 లక్షల వీక్షణలు లభించాయి. అలాగే అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు 7.89 లక్షల సబ్‌స్క్రైబర్లు, టర్కీ అధ్యక్షుడు రిసెప్‌ తయిప్‌ ఎర్డోగాన్‌కు 3.16 లక్షల సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.

- Advertisement -

యోగా విత్‌ మోడీ అన్న యూట్యూబ్‌ ఛానల్‌లో కూడా భారత ప్రధానికి మంచి ఫాలోయింగ్‌ లభించింది. ఆ ఛానల్‌లో ఆయనకు 73 వేల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు 2007లో మోడీ తన యూట్యూబ్‌ ఛానల్‌ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి సోషల్‌ మీడియాలో ఆయన పాపులారిటీ అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. ఇక కాంగ్రెస్‌ అగ్రనేత రా#హుల్‌ గాంధీ ఛానల్‌కు 35 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement