Tuesday, September 17, 2024

Foreign Tour సింగ‌పూర్‌లో ప్ర‌ధాని బిజీ … సెమీ కండ‌క్ట‌ర్ల త‌యారీ ప‌రిశ్ర‌మ‌ సంద‌ర్శ‌న‌


సెమీ కండ‌క్ట‌ర్ల త‌యారీ ప‌రిశ్ర‌మ‌ సంద‌ర్శ‌న‌
భార‌తీయ ఇంజినీర్ల‌తో మేమేకం
సెమికాన్ ఇండియా ఎగ్జిబిషన్‌కు రావాలి
అక్క‌డి పారిశ్రామిక‌వేత్త‌ల‌కు మోదీ ఆహ్వానం
ఇరు దేశాల మ‌ధ్య స్నేహ‌పూర్వ‌క భేటీ
మెరుగు కానున్న వాణిజ్య అవ‌కాశాలు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్‌:
సింగ‌పూర్ టూర్‌లో ప్ర‌ధాని మోదీ బిజీగా ఉన్నారు. సింగపూర్ పీఎం వాంగ్ ఆహ్వానం మేరకు రెండు రోజుల పర్యటనకు వెళ్ల‌రు. గురువారం ఉదయం సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రముఖ కంపెనీ అయిన ఏఈఎం హోల్డింగ్స్ లిమిటెడ్‌ను సందర్శించారు. ఇద్దరు నేతలు గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో కంపెనీ పాత్ర, దాని కార్యకలాపాలు, భారతదేశం కోసం ప్రణాళికల గురించి చర్చిస్తున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సింగపూర్ సెమీకండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్ అక్కడి సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ అభివృద్ధి, భారత్‌తో సహకారానికి చాన్సులపై ప్రధాని మోదీకి తెలియజేసింది.

- Advertisement -

నోయిడాలో స‌ద‌స్సుకు రండి..

సింగపూర్‌లో శిక్షణ పొందుతున్న భారతీయ ఇంటర్న్‌లతో పాటు సిఐఐ ఎంటర్‌ప్రైజ్ సింగపూర్ ఇండియా రెడీ టాలెంట్ ప్రోగ్రామ్ కింద భారతదేశాన్ని సింగపూర్ ఇంటర్న్‌లు సందర్శించారు. ఎఈఎంలో పనిచేస్తున్న భారతీయ ఇంజనీర్‌లను ప్రధాన క‌లుసుకుని వారితో సంభాషించారు. ఈ సందర్బంగా ఈ ఏడాది సెప్టెంబర్ 11 నుంచి 13 తేదీల్లో గ్రేటర్ నోయిడాలో జరగనున్న సెమికాన్ ఇండియా ఎగ్జిబిషన్‌లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించారు. భారత్‌లో చిప్‌ల తయారీకి కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య స్నేహపూర్వక, మెరుగైన వాణిజ్య అవకాశాల పరంగా సెమీకండక్టర్ పరిశ్రమకు ప్రధాని పర్యటన కీలకమైంది

.

Advertisement

తాజా వార్తలు

Advertisement