Sunday, September 8, 2024

Followup – 29కి పెరిగిన తమిళనాడు నాటు సారా మృతుల సంఖ్య

తమిళనాడులో నాటు సారా తాగిన ఘటనలో మృతుల సంఖ్య 29కు చేరింది. కల్లకురిచి జిల్లా కరుణాపురం ప్రాంతంలో మంగళవారం పలువురు సారా తాగి అనారోగ్యానికి గురయ్యారు.

వారిలో మరో 60 మంది బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది. మెరుగైన చికిత్స కోసం వారిని పుదుచ్చేరిలోని జిప్మర్‌ దవాఖానకు తరలించారు. ఘటనకు కారణమైన ఇద్దరు నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 200 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు.

నాటుసారా ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్‌ విచారణకు ఆదేశించారు. కల్లకురిచి కలెక్టర్‌పై బదిలీ వేటు వేయడంతో పాటు ఎస్పీని సస్పెండ్‌ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement