Monday, September 16, 2024

Flood Relief Fund – రూ. కోటి విరాళం ప్రకటించిన రామ్‌ చరణ్‌

హీరో రామ్‌ చరణ్‌ దాతృత్వం చాటుకున్నారు. తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చారు. రూ. 50 లక్షల చొప్పున రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి రూ. కోటి విరాళం ప్రకటించారు.

”వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు మనం తోడుగా.. అండగా ఉన్నామంటూ చేయూత అందించాల్సిన సమయమిది. నా వంతు బాధ్యతగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్‌లకు కోటి రూపాయలు విరాళంగా ప్రకటిస్తున్నా. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ పరిస్థితి నుంచి త్వరగా బయటపడాలని దేవుడిని ప్రార్థిస్తున్నా” అని పోస్ట్‌ పెట్టారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement