Tuesday, September 17, 2024

First Warning – 16 అడుగులకు చేరిన మున్నేరు – లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయిస్తున్న అధికారులు

ఖమ్మం జిల్లాలో హైలెర్ట్ ప్రకటించారు అధికారులు. నిన్న రాత్రి నుంచి భారీ వర్షం కారణంగా ఖమ్మం దగ్గర మున్నేరు వరద ప్రవాహం 16 అడుగులకు చేరుకుంది.

మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. గంటగంటకు మున్నేరు వరద ప్రవాహం పెరుగుతూ వస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. మైక్ ల ద్వారా ప్రజలకు పోలీసులు హెచ్చరిస్తున్నారు. వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement