Friday, September 20, 2024

AP: స్టీల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి, ఇద్దరికి తీవ్రగాయాలు..!

కర్నూలు బ్యూరో (ఆగస్టు 22) : కర్నూలు జిల్లాలోని ఓర్వకల్ జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ఫ్యాక్టరీలో గురువారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఓర్వకల్లులో జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణ దశలో ఉంది. ఈ క్రమంలో ఉదయం కొంతమంది కార్మికులు పనులు నిర్వహిస్తుండగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయి మంటలు చెలరేగినట్లు సమాచారం.

ఫ్యాక్టరీ మొదటి అంతస్తులో వెల్డింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జ‌రిగింది. ఈ ప్రమాదంలో కేబుళ్లు దగ్ధం కావడంతో రూ.కోటి వరకు నష్టం వాటిల్లినట్లు నిర్వాహకులు వెల్లడిస్తున్నారు. క్షతగాత్రుల వివరాలను కంపెనీ యాజమాన్యం గోప్యంగా ఉంచింది. ఈ విషయంపై స్థానిక ఎస్సై ను వివరాలు కోరితే తమకు సమాచారం లేదని సమాధానం ఇవ్వడంతో ప్రస్తుతం చనిపోయింది ఒకరా ? ఇంకా చాలా మంది ఉన్నారా ? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement