కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని చెక్-ఇన్ ఏరియా పోర్టల్ డీ వద్ద బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. స్వల్పంగా మంటలు, పొగ వచ్చినట్లు , ఈ మంటలను రాత్రి పూర్తిగా ఆర్పేసినట్లు తెలిపింది. ప్రయాణికులందరినీ సురక్షిత ప్రదేశానికి తరలించినట్లు పేర్కొంది. చెక్-ఇన్ ఏరియాలో పొగ వ్యాపించడం వల్ల కాసేపు చెక్-ఇన్ ప్రాసెస్ను నిలిపేసినట్లు వివరించింది.
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా స్పందిస్తూ, కోల్కతా విమానాశ్రయం చెక్-ఇన్ కౌంటర్ వద్ద దురదృష్టకర సంఘటన జరిగిందన్నారు అయితే ఇది స్వల్ప అగ్ని ప్రమాదమని తెలిపారు. విమానాశ్రయం డైరెక్టర్తో మాట్లాడుతున్నానని, పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపారు. ప్రమాద స్థలం నుంచి ప్రయాణికులందరినీ సురక్షిత ప్రదేశానికి తరలించినట్లు చెప్పారు. చెక్-ఇన్ ప్రాసెస్ గత రాత్రి 10.25 గంటలకు పునఃప్రారంభమైందన్నారు. ప్రమాదానికి కారణాలేమిటో త్వరలోనే తెలుసుకుంటామన్నారు