Thursday, October 3, 2024

Fire Accident | హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో ఘోర అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌ నగరంలోని ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో బుధవారం అగ్ని ప్రమాదం జరిగింది. మెట్రో స్టేషన్‌ కింద ఉన్న శ్రీదత్త సాయి కమర్షియల్‌ కాంప్లెక్స్‌లో భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

అయితే, కాంప్లెక్స్‌ను ఆనుకొని దుకాణాలు ఉన్నాయి. చుట్టుపక్కలకు మంటలు అంటుకొనే ప్రమాదం ఉండడంతో ముందు జాగ్రత్తగా వారందరినీ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఖాళీ చేయిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ప్రస్తుతం ఘటనా స్థలంలో భారీగా పొగ కమ్మేసింది.

ఒక్కసారిగా జరిగిన అగ్ని ప్రమాదం స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉన్నది. మరోవైపు.. ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌వైపు వస్తున్న వాహనాలను ముషీరాబాద్‌లోనే నిలిపిస్తున్నారు. దీంతో, ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement