Sunday, October 6, 2024

Fire Accident – ముంబాయిలో అగ్ని ప్రమాదం – ఐదుగురు దుర్మరణం

మహారాష్ట్రలోని ముంబయిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగి ఏడుగురు సజీవదహనమయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. ముంబయిలోని చెంబూర్‌ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఆదివారం తెల్లవారుజామున షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చలరేగాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. బాధితుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. మంటలు వ్యాపించిన సమయంలో ఆ కుటుంబం నిద్రలో ఉండడంతో తప్పించుకోలేకపోయారు.

అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు యత్నించారు. బాధితులను రాజావాడి ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే మృతి చెందారని అధికారులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement