Thursday, October 3, 2024

KTR | పడిపోతున్న రాష్ట్ర ఆదాయం.. పాలనా వైఫల్యానికి ఇదే నిదర్శనం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : రాష్ట్ర ఖజానాకు తగ్గుతున్న ఆదాయంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. పడిపోతున్న ప్రభుత్వ ఆదాయం.. పరిపాలన వైఫల్యానికి నిదర్శనం.. అనుభవ రాహిత్యంతోనే ఈ అనర్థం.. అంటూ కేటీఆర్ ట్వీట్‌ చేశారు.

”తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు గడుస్తున్నప్పటికీ ఏ ఒక్క సంక్షేమ, అభివృద్ధి పథకం అమలుకు నోచుకోలేదు. రేవంత్‌ సర్కార్‌ పరిపాలన ఎక్కడ వేసినా గొంగడి అక్కడే అన్నచందంగా తయారైంది. పరిపాలన అస్తవ్యస్తంగా మారడంతో పెట్టుబడులు ఆగిపోయాయి. దీంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా లేకుండా పోయాయి. ఆదాయం కూడా పూర్తిగా పడిపోయింది” అని పేర్కొన్నారు.

సంపద సృష్టించి పేదలకు పంచే తెలివి.. సీఎం రేవంత్‌ రెడ్డికి లేకపోవడంతో అసలు సమస్య ఏర్పడిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే ఈ దుస్థితి ఉంటే.. వచ్చే నాలుగేళ్లు కష్టకాలమే అని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈ గడ్డు పరిస్థితులను మరింత దిగజార్చే చేష్టలే తప్ప.. దిద్దుబాటు చర్యలు కనుచూపు మేరలో కనిపించడం లేదన్నారు. తెలంగాణ ప్రగతి పథానికి పాతరేసిన పాపం.. మార్పు మార్పు అంటూ మోసం చేసిన కాంగ్రెస్‌ పార్టీదే అని కేటీఆర్‌ దుయ్యబట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement