Sunday, October 20, 2024

TG | యూనివర్సీటీల్లో ఇన్‌ఛార్జి వీసీల పదవీకాలము పొడిగింపు

తెలంగాణలో యూనివర్సిటీల ఇన్‌ఛార్జ్ వీసీల పదవీకాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా రాష్ట్రంలోని 10 యూనివర్సిటీలకు ఐఏఎస్‌లను ఇన్‌ఛార్జ్‌ వీసీలుగా నియమిస్తూ జూన్‌ 15 వరకు ఇన్‌చార్జి వీసీలు కొనసాగుతారని విద్యాశాఖ ఈనెల ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తిస్థాయిలో వీసీలను నియమించకపోవడంతో ఇన్ చార్జిల పదవీకాలం పొడిగించారు.

ఉస్మానియా యూనివర్సిటీకి దాన కిశోర్, కాకతీయ యూనివర్సిటీ ఇన్‌ఛార్జి వీసీగా వాకాటి కరుణ, జేఎన్‌టీయూ బాధ్యతలను బుర్ర వెంకటేశ్‌కు ప్రభుత్వం అప్పగించింది. తెలంగాణ వర్సిటీకి సందీప్ సుల్తానియా,అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ రిజ్వి, తెలుగు యూనివర్సిటీకి వీసిగా శైలజ రామయ్యర్ నియమితులయ్యారు. అలాగే శాతవాహన వర్సిటీకి సురేంద్ర మోహన్,జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్‌కి జయేశ్‌ రంజన్‌,మహాత్మా గాంధీ వర్సిటీకి నవీన్ మిట్టల్, పాలమూరు వర్సిటీ ఇన్‌ఛార్జి వీసీగా నదీం అహ్మద్‌ను నియమించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement