Saturday, September 21, 2024

TS | ఈసీ కీలక నిర్ణయం.. పోలింగ్ సమయం పెంపు

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పోలింగ్‌ సమయాన్ని గంటపాటు పొడిగిస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. తెలంగాణలో ఈ నెల (మే) 13న లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌కు సమయం ఇచ్చారు. తాజాగా ఆ సమయాన్ని సాయంత్రం 6 గంటల వరకు పొడిగించారు. అయితే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ నిర్వహిస్తామని ఏజెన్సీ స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement