Sunday, September 22, 2024

Gajkesari | స్టీల్ ప్లాంట్లో పేలుడు.. 22 మందికి గాయాలు

మ‌హారాష్ట్ర ఎంఐడీసీ ప్రాంతంలోని గజ్‌కేసరి స్టీల్‌ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలింది. ఈ ప్రమాదంలో కరిగిన ఇనుము కార్మికులపై పడిందని పోలీసులు తెలిపారు. దాదాపు 22 మంది కార్మికులు గాయపడ‌గా.. ఛత్రపతి శంభాజీనగర్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో వారికి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.

వారిలో ముగ్గురు కార్మికుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన కార్మికుల వాంగ్మూలాలను నమోదు చేస్తున్నట్లు పోలీస్‌ అధికారి తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి కంపెనీ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement