Saturday, September 21, 2024

Tamil Nadu : బాణాసంచా గోడౌన్‌లో పేలుడు… ఇద్దరు మృతి

బాణాసంచా ముడిసరుకు గోడౌన్‌లో పేలుడు సంభవించి ఇద్దరు స్పాట్‌లోని దుర్మరణం పాలైన ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. విరుధునగర్ జిల్లా శ్రీవల్లిపుత్తూరులో లారీ నుంచి కార్మికులు ముడిసరుకు దించుతుండగా అకస్మాత్తుగా పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది.

ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. స్థానికుల సమాచారం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా గాయపడిన వారిని అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం విరుధునగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement