Saturday, October 5, 2024

Encounter – క‌శ్మీర్ లో ఎన్ కౌంట‌ర్ …. ఇద్ద‌రు ఉగ్ర‌వాదుల హ‌తం

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో సైన్యం, ఉగ్రవాదుల మధ్య నేటి తెల్ల‌వారుజామున ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు హ‌తమ‌య్యారు.. కాగా, కుప్వారాలోని గుగల్‌ధర్‌లో ఉగ్రవాదుల చొరబాటు యత్నంపై నిఘా సమాచారం అందిన వెంటనే, భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు నేడు సంయుక్త ఆపరేషన్‌ చేపట్టారు.

ఈ సంద‌ర్బంగా తార‌స‌ప‌డ్డ ఉగ్ర‌వాదుల‌తో కొన్ని గంటలపాటు కొనసాగిన ఎన్‌కౌంటర్ తర్వాత, కుప్వారాలోని గుగల్ధర్ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులను ఆర్మీ సిబ్బంది హతమార్చారు. హతమైన ఉగ్రవాదుల నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి ఉ‍గ్రవాదుల చొరబాటు యత్నాన్ని భద్రతా బలగాలు భగ్నం చేశాయని భారత సైన్యం తెలిపింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement