Thursday, July 4, 2024

Chhattisgarh: భారీ ఎన్ కౌంటర్.. 11మంది మావోయిస్టుల మృతి

తుపాకుల మోతతో దండకారణ్యం మరోసారి దద్దరిల్లింది. ఛత్తీస్ ఘడ్ లోని నారాయణ్ పూర్ జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. కొహక మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధనంది-కుర్రేవాయ మధ్య అటవీలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు మావోయిస్టులు ఎదరుపడటంతో ఇరువురు కాల్పులకు పాల్పడ్డారు.

ఈ కాల్పుల్లో 11మంది మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఇక ఈ ఆపరేషన్ లో ఎస్ టీఎఫ్, ఆర్ జీ, బీఎస్ ఎఫ్, ఐటీబీపీ పోలీసులు పాల్గొన్నట్లు ఐజీ సుందర్ రాజ్ తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement