Friday, October 4, 2024

Encounter – ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో ఎన్ కౌంటర్ – ఏడుగురు మావోయిస్ట్ లు మృతి…

ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలోని నారాయణ్‌పుర్‌- దంతెవాడ సరిహద్దుల్లో శుక్రవారం ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. ఈ ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. బస్తర్‌ రేంజ్‌లోని దంతెవాడ, నారాయణ్‌పుర్‌ జిల్లాల సరిహద్దుల్లో ఉండే అబూజ్‌మడ్‌ దండకారణ్యంలో మావోయిస్టులు నక్కినట్లు సమాచారం అందింది. దీంతో భద్రతా సిబ్బంది ఈ ప్రాంతంలో ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టారు.

ఈ క్రమంలోనే మధ్యాహ్నం సమయంలో భద్రతా దళాలను చూసిన మావోయిస్టులు వారిపై కాల్పులకు దిగారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. ఘటనాస్థలంలో ఏడుగురు మావోయిస్టుల మృతదేహాలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అంతేగాక భారీ ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్‌కౌంటర్‌ కొనసాగుతోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement