Monday, October 7, 2024

Electric shock | విద్యుత్‌ షాక్‌తో… ఇద్దరు కార్మికులు మృతి

మేడ్చల్ జిల్లా కండ్లకోయలో విషాదం నెలకొంది. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు కంపెనీ గోదాము వద్ద హైటెన్షన్ విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు కాంట్రాక్ట్ కార్మికులు మృతి చెందారు. వాహనంలో నిచ్చెనను తరలిస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.

మృతులు గుడుబైటా (26), మంగీ(25)లుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరో నలుగురికి గాయాలవ్వగా.. వారు కండ్లకోయలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement