Friday, September 20, 2024

ED – ఆ ఎంపికి అన‌కొండంత జరిమానా….

చెన్నై – త‌మిళ‌నాడులోని అధికార డీఎంకే పార్టీకి చెందిన ఎంపీ, ప్రముఖ వ్యాపారవేత్త ఎస్.జ‌గ‌త్ర‌క్ష‌క‌న్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) భారీ షాక్ ఇచ్చింది. ఆయ‌న‌తో పాటు ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు రూ. 908 కోట్ల జ‌రిమానా విధించింది. విదేశీ మార‌క‌ద్ర‌వ్య నిర్వ‌హ‌ణ చ‌ట్టం (ఫెమా) నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న కేసులో ఈ భారీ జ‌రిమానా విధించిన‌ట్లు ఈడీ స్ప‌ష్టం చేసింది. ఈ నెల 26వ తేదీన వ‌చ్చిన తీర్పుకు లోబడి ఈ చ‌ర్య‌లకు ఉప‌క్ర‌మించింది. ఇక ఫెమా చ‌ట్టంలోని 37ఏ సెక్ష‌న్ ప్ర‌కారం 2020 సెప్టెంబ‌ర్‌లో జప్తు చేసిన రూ. 89.19 కోట్ల మొత్తాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఆదేశాలు ఉన్నాయని, ఈ మొత్తాన్ని కూడా జరిమానాలో కలిపినట్టు ఈడీ పేర్కొంది. కాగా, వ్యాపార‌వేత్త అయిన జ‌గ‌త్ర‌క్ష‌క‌న్ ప్ర‌స్తుతం అర‌క్కోణం లోక్ స‌భ స్థానం నుంచి లోక్‌స‌భ‌ సభ్యుడిగా ఎన్నిక‌య్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement