Friday, September 6, 2024

Earthquake: ఉత్తరాఖండ్‌లో భూకంపం

ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని పితోర్‌గఢ్‌లో మంగళవారం తెల్లవారుజామున భూమి ఒక్కసారిగి కంపించింది. దీంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అసలు ఏం జరుగుతుందో తెలియక ఎక్కడి వారు అక్కడే నిలబడిపోయారు.

- Advertisement -

భూకంపం ప్రభావం రిక్టర్ స్కేల్ పై 3.1 తీవ్రతతో నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ప్రకంపనలు ఉదయం 6.43 గంటలకు సంభవించాయని తెలిపింది. భూకంపం ధాటికి ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement