Sunday, September 8, 2024

ఛత్తీస్‌గఢ్‌లో భూకంపం… భయంతో పరుగులు తీసిన జనం

ఛత్తీస్‌గఢ్‌లో స్వ‌ల్ప భూకంగా సంభ‌వించింది. సుర్గుజా జిల్లా అంబికాపూర్ సమీపంలో భూమి కంపించింది. దీంతో స్థానిక ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌కు గురై ఇళ్ల‌నుంచి ప‌రుగులు తీశారు. భూకంపం దీని తీవ్రత 4.8గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ వెల్లడించింది. అంబికాపూర్‌కు 65 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని తెలిపింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు ఏర్పడ్డాయని పేర్కొన్నది. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement