Sunday, August 4, 2024

Earth Quake – కాశ్మీర్ లో భూకంపం

+రిక్ట‌ర్ స్కేల్ పై 4.1 గా తీవ్ర‌త న‌మోదు
బారాముల్లాలో ప‌రుగులు తీసిన జ‌నం
ఆస్తీ, ప్రాణ న‌ష్టం జ‌ర‌గలేద‌ని అధికారుల ప్ర‌క‌ట‌న

జమ్మూకశ్మీర్‌లో నేడు భూకంపం సంభవించింది. కాశ్మీర్‌ లోని బారాముల్లాలో ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 4.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ప్రకంపనలు రావడంతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది. దింతో వారు రోడ్లపైకి పరుగులు తీశారు. ఇకపోతే, భూకంపం తర్వాత బారాముల్లాలో ప్రజలలో గందరగోళం నెలకొంది. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. భూకంపం తీవ్రత ఎక్కువగా ఉండడంతో మార్కెట్‌ లో బిజీగా ఉన్న ప్రజలు, దుకాణదారులు ఒక్కసారిగా సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. అయితే సమాచారం మేరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement