Friday, October 18, 2024

Dussehra effect : నిర్మానుష్యంగా హైదరాబాద్

రాజధాని నగరమైన హైదరాబాద్ నిర్మానుష్యంగా మారిపోయింది. దసరా పండుగకు గాను ప్రజలు వారి స్వస్థలాలకు వెళ్లడంతో నగరంలోని రహదారులు బోసిపోతున్నాయి. పండుగ నేపథ్యంలో వరుస సెలవులు రావడంతో ప్రజలు సొంతూళ్లకు వెళ్తున్నారు. హైదరాబాద్ లోని సిటీ బస్సులు సైతం తక్కువ ఆక్యుపెన్సీతో తిరుగుతున్నాయి.

గత బుధవారం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు నగరాన్ని వీడారు. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సులు, రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. రెండు రాష్ట్రాల ఆర్టీసీలు ప్రత్యేక బస్సులను నడుపుతున్నాయి. ప్రైవేట్ బస్సులు డబుల్ ఛార్జీలు వసూలు చేస్తూ ప్రయాణికులను దోచుకుంటున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో పాఠశాలల సెలవులు ఈనెల 14తో ముగియనున్నాయి. దీంతో ఊళ్లకు వెళ్లిన వారంతా రాబోయే మంగళ, బుధవారాల్లో మళ్లీ హైదరాబాద్ కు చేరుకోనున్నారు.

టోల్ గేట్ వ‌ద్ద …..

- Advertisement -

యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ సమీపంలో ఉన్న పంతంగి టోల్‌ ప్లాజావద్ద వాహనాలు క్యూకట్టాయి. పండుగ వాహనాలతో హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి కిక్కిరిసిపోయింది. అదేవిధంగా హైదరాబాద్‌-వరంగల్‌ రహదారిపై ట్రాఫిక్‌ రద్దీ విపరీతంగా పెరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement