Friday, October 18, 2024

దేశ‌పౌరుల‌కు దుర్గాపూజ శుభాకాంక్ష‌లు : రాష్ట్రపతి ముర్ము

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు గురువారం దుర్గాపూజ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ అన్ని మతాల మధ్య ఐక్యత, అవగాహనను పెంపొందించడానికి…. దుర్గామాతకు మనల్ని మనం పూర్తిగా అంకితం చేసుకోవడానికి ఒక సందర్భం అని అన్నారు.

దుర్గాపూజను చెడుపై మంచి సాధించిన విజయంగా జరుపుకుంటార‌న్న ముర్ము….. దేశంలోని తోటి పౌరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సండ‌ర్భంగా న్యాయమైన, సున్నితమైన, సమానమైన సమాజాన్ని సృష్టించడానికి శక్తి, ధైర్యాన్ని, దృఢ సంకల్పాన్ని ప్రసాదించాలని దుర్గామాతను ప్రార్థిద్దాం అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement