Monday, October 21, 2024

‘‘దురంతో’’ రైలులో కాల్పుల కలకలం.. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న రైల్వే పోలీసులు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : సికింద్రాబాద్‌ నుంచి హజరత్‌ నిజాముద్దీన్‌ వెళ్తున్న దురంతో ఎక్స్‌ప్రెస్‌ రైలులో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. పరుగులు పెడుతున్న రైలులో కాల్పుల శబ్ధం వినిపించడంతో ఒక్కసారిగా ప్రయాణికులు కంగుతిన్నారు. ఇద్దరు స్నేహితులు రైల్లో ప్రయాణిస్తుండగా వారి మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో ఒక వ్యక్తి తన వద్ద తుపాకీతో గాలిలోకి కాల్పులు జరిపాడు.

మంచిర్యాల సమీపంలోకి రైలు చేరుకుంటున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనను గమనించి రైల్వే టికెట్‌ కలెక్టర్‌ (టీసీ) వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన రైల్వే పోలీసులు కాల్పులు జరిపిన వ్యక్తిని కాగజ్‌నగర్‌ రైల్వే స్టేషన్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఘర్షణ పడిన ఇద్దరూ ఆర్మీలో పని చేస్తున్నట్లు సమాచారం. అదుపులోకి తీసుకున్న వారిని పోలీసులు విచారిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement