Friday, October 18, 2024

Drowned – ర‌ష్యాలో విషాదం… న‌దిలో ప‌డి న‌లుగురు భార‌తీయ విద్యార్ధులు మృతి

రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ సమీపంలో నదిలో అయిదుగురు భారతీయ విద్యార్థులు మునిగిపోయారు. స్థానికులు అందులో ఒకరిని రక్షించారు. నలుగురు పూర్తిగా నీటిలో ముగిని మృతి చెందారు. మరణించిన నలుగురిలో 18-20 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు యువ‌కులు కాగా,మ‌రో ఇద్ద‌రు యువ‌తులు . వారంతా వెలికి నొవ్‌గోరోడ్ నగరంలోని సమీపంలోని నొవ్‌గోరోడ్ స్టేట్ యూనివర్శిటీలో చదువుతున్నారు.

కాగా, వోల్ఖోవ్ నది ఒడ్డున నిలబడిన ఉన్న ఓ భారతీయ విద్యార్థిని నీటిలో మునిగింది. ఆమెను రక్షించేందుకు నలుగురు సహచరులు ప్రయత్నించారు. ఆమెను కాపాడే ప్రయత్నంలో ఆ విద్యార్థినితోపాటు మరో ముగ్గురు కూడా నదిలో మునిగిపోయారు. ఓ బాలుడిని స్థానికులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. “సరైన వైద్యం అందిస్తున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని అని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని ఇండియన్ మిషన్ “ఎక్స్‌”లో రాసింది.

- Advertisement -

వీలైనంత త్వరగా మృత దేహాలను బంధువులకు పంపడానికి వెలికి నొవ్‌గోరోడ్ స్థానిక అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు కాన్సులేట్ జనరల్ తెలిపారు. మృతుల కుటుంబాలను సంప్రదించి, అన్ని విధాలా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. తాము రష్యాలోని భారత రాయబార కార్యాలయాన్ని, సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని కాన్సులర్ జనరల్‌ను సంప్రదించామని జలగావ్ జిల్లా కలెక్టర్ ఆయుష్ ప్రసాద్ ఓ మీడియా సంస్థకు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement