Friday, September 20, 2024

Donations – వ‌ర‌ద బాధితుల‌కు చిరంజీవి, రామ్ చరణ్ లు రూ.కోటి సాయం

రామ్ చ‌ర‌ణ్ కూడా రూ.50 ల‌క్ష‌ల విరాళం
ముఖ్య‌మంత్రి రేవంత్ కు రెండు చెక్ లు అంద‌జేత
అమ‌రాజా రూ కోటి విరాళం
అలీ, విశ్వ‌క్ సేన్,సాయి ధ‌ర్మ తేజ్ లు సాయం

హైద‌రాబాద్ – తెలంగాణ వరద బాధితులకు విరాళాలు జోరుగా అందుతున్నాయి. దీనిలో భాగంగా ఇప్పటికే సీఎం సహాయనిధికి రూ. 50 లక్షలు విరాళం ప్రకటించిన మెగాస్టార్ చిరంజీవి సహాయ చెక్కును జూబిహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నేడు అందజేశారు. రామ్ చరణ్ తరపున మరో 50లక్షలు సీఎం సహాయనిధి చెక్కును కూడా సీఎంకు చిరంజీవి అందించారు.

అమర్ రాజా గ్రూప్ తరపున మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి సీఎం సహాయనిధికి రూ.కోటి విరాళం చెక్కును అందజేశారు. అలాగే సీనియర్ నటుడు అలీ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.3లక్షలు విరాళంగా అందజేశారు. నటుడు విశ్వక్ సేన్ రూ.10లక్షలు విరాళంగా అందించారు. నటుడు సాయిధరమ్ తేజ్ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.10లక్షలు విరాళం అందించారు.

అలాగే , ముఖ్యమంత్రి సహాయనిధికి మాజీ ఎంపీ రాజమోహన్ రెడ్డి రూ.25లక్షలు విరాళం అందజేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement