Friday, September 13, 2024

Donation – వరద బాధితులకు నారా భువనేశ్వరి ₹.2 కోట్ల విరాళం

హైదారాబాద్ – వరద బాధితులను ఆదుకునేందుకు హెరిటేజ్ ఫుడ్స్ చైర్మన్ నారా భువనేశ్వరి సైతం రెండు తెలుగు రాష్ట్రాలకు విరాళం ప్రకటించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెరో కోటి రూపాయలు చొప్పున ఆమె విరాళం ప్రకటించారు.

రెండు తెలుగు రాష్ట్రాల సీఎం సహాయనిధికి హెరిటేజ్ ఫుడ్స్ చెక్కులు పంపనుంది. కష్టాల్లో ఉన్న బాధితులను అధికొనేందుకు తమ సహాయం ఉపయోగపడుతుందని భువనేశ్వరి ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement