Friday, October 18, 2024

Donation – ఎపి వరద బాధితులకు మెగా ఫ్యామిలీ రూ. కోటి విరాళం

హైదరాబాద్ – తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం చిరంజీవి భారీ విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ఏపీ సీఎం చంద్రబాబు ను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిశారు.

చిరంజీవి తరఫున రూ.50లక్షలు, రామ్‌చరణ్‌ తరఫున మరో రూ.50లక్షల చెక్కులను చంద్రబాబుకు అందజేశారు. విపత్కర సమయంలో సహాయం అందించిన చిరంజీవికి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement