Thursday, September 19, 2024

Donation – తెలుగు రాష్ట్రాలకు అమర రాజా రూ 3 కోట్ల విరాళం

తిరుపతి, (రాయలసీమ ప్రభన్యూస్ బ్యూరో )సుప్రసిద్ద సంస్థ అమర రాజా గ్రూప్ రెండు తెలుగు రాష్ట్రాలలో వరద సహాయక చర్యలకు తమ వంతు సహాయంగా తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 1 కోటి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 2 కోట్ల విరాళాలను ఈరోజు అందించింది. అమరరాజా గ్రూపు సహ వ్యవస్థాపకురాలు అరుణ కుమారి గల్లా, అమర రాజా ఎనర్జీ & మొబిలిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విక్రమాదిత్య గౌరినేని హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తమ విరాళాలకు సంబంధించిన చెక్కుల ను అందజేశారు.

ఈ సందర్బంగా అమర రాజా గ్రూప్ ఛైర్మన్ జయదేవ్ గల్లా మాట్లాడుతూ సామాజిక బాధ్యత పట్ల సంస్థ యొక్క దీర్ఘకాల నిబద్ధతను చెబుతూ ఈ కష్ట సమయంలో మేము అందిస్తున్న ఈ విరాళం, వారిని ఆదుకునేందుకు చేస్తున్న మా విస్తృత ప్రయత్నాలలో భాగం. ఈ కష్ట సమయంలో ప్రభావితమైన వారి త్వరిత పునరుద్ధరణ మరియు పునరావాసానికి ఇది దోహదపడుతుందని మేము ఆశిస్తున్నామని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement