Monday, September 16, 2024

GHMC | ఎకో ఫ్రెండ్లీ మట్టి గణపతి విగ్రహాల పంపిణీ..

వినాయక చవితి సందర్భంగా పర్యావరణ హితం కోసం మట్టి వినాయక ప్రతిమలను పూజిద్దామని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పిలుపునిచ్చారు. ఎల్‌బీ నగర్‌ జోన్‌, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో గురువారం ఆమె ఉద్యోగులు, సిబ్బందికి మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు.

భవిష్యత్ తరాలకు కాలుష్య రహిత వాతావరణం కల్పించడం, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని.. పర్యావరణం పట్ల ప్రజలను చైతన్య పరచడంలో భాగంగా జీహెచ్ఎంసీ ద్వారా మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది జీహెచ్ఎంసీ ద్వారా 3.10 లక్షల మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

అందులో 8 ఇంచుల సైజులో 2.70 లక్షలు, ఒక ఫీట్ సైజులో 30 వేలు, ఒకటిన్నర ఫీట్ సైజులో 10 వేల విగ్రహాలను పంపిణీ చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమీషనర్ పంకజ, చీఫ్ మెడికల్ అధికారి డాక్టర్ పద్మజ పాల్గొన్నారు. జిహెచ్ఎంసి అధికారులు, ఉద్యోగులు పాల్గొని మట్టి వినాయక ప్రతిమలను స్వీకరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement