Sunday, September 8, 2024

గణేశ్​ నిమజ్జనంలో అపశ్రుతి.. వేర్వేరు ఘటనల్లో ఏడుగురు మృతి

హ‌ర్యానాలో గ‌ణేశ్ నిమ‌జ్జ‌న వేడుక‌ల్లో గ‌ణ‌నాథుడిని నిమ‌జ్జ‌నం చేస్తుండ‌గా.. ఏడుగురు వ్య‌క్తులు నీటిలో మునిగి చ‌నిపోయారు. సోనిప‌ట్‌లో ముగ్గురు చ‌నిపోగా, మ‌రో న‌లుగురు మ‌హేంద్ర‌గ‌ర్హ్‌లో మృతి చెందారు. సోనిప‌ట్‌లోని మిమార్‌పూర్ ఘాట్ వ‌ద్ద వినాయ‌కుడిని నిమ‌జ్జ‌నం చేసేందుకు ఓ వ్య‌క్తి త‌న కుమారుడు, అల్లుడితో క‌లిసి వ‌చ్చాడు. ఇక గ‌ణ‌నాథుడిని నిమ‌జ్జ‌నం చేస్తుండ‌గా, ప్ర‌మాద‌వ‌శాత్తు ఈ ముగ్గురు నీటిలో మునిగి చ‌నిపోయారు. మృత‌దేహాల‌ను పోలీసులు బ‌య‌ట‌కు వెలికితీశారు. ఇక మ‌హేంద్ర‌గ‌ర్హ్‌కు స‌మీపంలోని ఓ కెనాల్‌లో గ‌ణ‌నాథుడిని నిమ‌జ్జ‌నం చేసేందుకు ఓ 9 మంది బ‌య‌ల్దేరారు. అక్క‌డ వ‌ర‌ద ఉధృతి ఎక్కువ‌గా ఉండ‌టంతో.. న‌లుగురు వ్య‌క్తులు కొట్టుకుపోయారు. రాత్రే గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టి మృత‌దేహాల‌ను బ‌యట‌కు తీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement