Sunday, September 8, 2024

Suicide – తుపాకీ తో కాల్చుకుని డి ఐ జి ఆత్మహత్య

తమిళనాడులోని కోయంబత్తూరులో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. డిప్యూటి ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (కోయంబత్తూరు రేంజ్) సి విజయకుమార్ శుక్రవారం ఉదయం ఇక్కడి రేస్ కోర్స్‌లోని తన క్యాంపు కార్యాలయంలో పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, విజయకుమార్ ఉదయం వాకింగ్‌కు వెళ్లి 6.45 గంటలకు తన క్యాంపు కార్యాలయానికి వచ్చాడు. ఆ తరువాత తన పిస్టల్‌ ఇవ్వమని తన వ్యక్తిగత భద్రతా అధికారి (పిఎస్‌ఓ)ని కోరాడు. ఆ పిస్టల్ తీసుకుని కార్యాలయం నుండి బయటకు వచ్చాడు. ఉదయం 6.50 గంటల ప్రాంతంలో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.క్యాంపు కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఇతర పోలీసులు పిస్టోల్ శబ్దానికి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే సీనియర్ పోలీసు అధికారులకు సమాచారం అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement