Wednesday, September 25, 2024

Devotional – తిరుమలకు క్యూకడ్తున్న అధినేతలు

తిరుమల లడ్డూ వివాదం రోజురోజుకూ హీటెక్కుతోంది. ఈ నేపథ్యంలోనే తిరుమల కొండకు అధినేతల రాక మరింత కలవరాన్ని కలిగిస్తోంది. మాజీ సిఎం జగన్‌. ఈ నెల 28న తిరుమలకు రానున్నారు. కాలినడకన వెళ్లి శ్రీవారిని దర్శించుకోనున్నారు.

అక్టోబర్‌ 1న డిప్యూటీ సిఎం పవన్‌ కల్యాణ్‌ తిరుమలకు విచ్చేసి శ్రీవారి సమక్షంలో దీక్షను విరమించనున్నారు. 3వ తేదీ తిరుపతిలో ‘వారాహి’ సభ నిర్వహించ నున్నారు.

4వ తేదీ తిరుమల బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా తిరుమలకు రానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement