Tuesday, October 22, 2024

Derailed – ప‌ట్టాలు త‌ప్పిన శాలిమార్ ఎక్స్ ప్రెస్…

ముంబ‌యి – శాలిమార్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు తృటిలో పెనుప్రమాదం తప్పింది. రైలులోని మూడు బోగీలు పట్టాలు తప్పాయి. అయితే లోకో పైలట్ అప్రమత్తమై రైలును వెంటనే నిలిపేయడంతో పెనుముప్పు తప్పింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ నగర సమీపంలోగల కాలమ్నా రైల్వేస్టేషన్‌కు కొద్ది దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ప్రయాణికులు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. రైలు పట్టాలు తప్పడంతో ఆ మార్గంలో రాకపోకలు సాగించాల్సిన కొన్ని రైళ్లను నిలిపేశారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు. ప్రస్తుతం పట్టాలు తప్పిన బోగీలను సరిచేసి మళ్లీ ట్రాక్‌ ఎక్కించే పనులు కొనసాగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement