Friday, October 4, 2024

Maharashtra | సెక్రటేరియట్ పైనుంచి దూకిన‌ డిప్యూటీ స్పీక‌ర్…

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ : మహారాష్ట్ర సచివాలయం పైనుంచి అధికార కూటమి శాసనసభ్యుడు దూకడం కలకలం రేపింది. అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎన్​సీపీ శాసనసభ్యుడు, డిప్యూటీ స్పీకర్ ముంబయిలోని సెక్రటేరియట్ భవనం మూడో అంతస్తు నుంచి కిందకు దూకారు.

అయితే, ఇలాంటి ఘటనలు అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన సేఫ్టీ నెట్​లో పడి, అక్కడే చిక్కుకుపోయారు. ఆయన్ను పోలీసులు సురక్షితంగా కిందకు తీసుకొచ్చారు. గిరిజనుల రిజర్వేషన్ కోటాను నీరుగార్చడంపై నిరసన తెలిపేందుకు ఇలా చేశానని నరహరి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement