Wednesday, September 18, 2024

TG | ఆర్థిక శాఖ సిబ్బందికి డిప్యూటీ సీఎం విందు..

బడ్జెట్‌కు ముందు ఆర్థిక మంత్రి అధికారులు, సిబ్బందికి విందు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. సంప్రదాయం కొనసాగింపులో భాగంగా శుక్రవారం సాయంత్రం ప్రజాభవన్‌లో ఆర్థిక శాఖ అధికారులు, సిబ్బందికి డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి విందు ఏర్పాటు చేశారు.

బడ్జెట్ నేపథ్యంలో ఎలాంటి మానసిక ఒత్తిడికి లోనుకాకుండా స్నేహపూర్వక వాతావరణంలో పని చేయాలనే ఆలోచనతో అధికారులు, సిబ్బందికి విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం సిబ్బంది ఒక్కొక్కరి వద్దకు వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement