Sunday, September 8, 2024

TG | డిప్యూటీ సీఎం భట్టి ‘బ‌డ్జెట్ విందు’.. హాజరైన సీఎం రేవంత్

తెలంగాణ గురువారం అసెంబ్లీలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఈరోజు రాత్రి ప్రజాభవన్‌లో ప్రజాప్రతినిధులు, ఆర్థిక శాఖ అధికారులకు విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు.

ఇక‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ జితేందర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆర్థిక శాఖ అధికారులు, సిబ్బంది కూడా పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement