Thursday, September 12, 2024

TG | 31న పెద్ద‌ప‌ల్లిలో ఉప‌ముఖ్య‌మంత్రి భ‌ట్టి పర్యటన..

పెద్దపల్లి,(ప్రభ న్యూస్): రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ నెల 31న (శనివారం) పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. శనివారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి 9.45 గంటలకు రామగుండం హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.

ఉదయం 10 గంటల నుంచి 10:30 వరకు టిఎస్ జెన్ కో 800 మెగా వాట్ల పవర్ ప్లాంట్ సైట్ సందర్శించనున్నారు. 10:30 నుంచి 10:45 వరకు గోదావరిఖని లో నిర్మించిన స్కిల్ సెంటర్ సెక్టార్ 2 ను ప్రారంబించి ఉదయం 10.45 నుంచి 11.30 వరకు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో టి.యూ.ఎఫ్.ఐ.డి.సి, అమృత్ 2 నిధుల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన అనంతరం జవహర్లాల్ నెహ్రూ స్టేడియం లో నిర్వహించే బహిరంగ సభలో ప్రజలనుదేశించి ప్రసంగించనున్నారు.

11:30 నుంచి 12:30 వరకు సింగరేణి ఆర్జి 1 లోని మేడిపల్లి మినీ ఓపెన్ క్యాస్ట్ మైనింగ్ సందరించి మధ్యాహ్నం 12.30 నుంచి 1.30 వరకు ఇల్లెందు అతిథి గృహంలో భోజనం చేసిన అనంతరం మంచిర్యాల జిల్లా పర్యటనకు బయలు దేరుతారు. పెద్దపల్లి జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన కోసం పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement