Monday, September 23, 2024

Delhi – భ‌ర‌తుడి ప‌రిస్థితి నాది … సిఎం సీటు ఎప్ప‌టికీ ఆయ‌న‌దే: అతిశీ

ఆయ‌న సీటులో ఎప్పుడూ కూర్చేనేది లేదు
సిఎంగా భాద్య‌త‌లు స్వీక‌రించిన అనంత‌రం అతిశీ

ఢిల్లీ నూతన సీఎంగా ఆతిశీ నేడు బాధ్యతలు స్వీకరించారు. ఈ సమయంలో ఆమె ఆప్‌ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. ఆయన కోసం పక్కన కుర్చీని ఖాళీగా ఉంచి, తాను వేరే సీట్లో కూర్చొని బాధ్యతలు చేపట్టారు. దీనికి సంబంధించిన దృశ్యాలను ఆప్ ఎక్స్(ట్విటర్) ఖాతాలో షేర్ చేసింది.

అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ రామాయణంలోని ఓ సందర్భాన్ని ప్రస్తావించారు. ”నాకు ప్రస్తుతం భరతుడికి ఎదురైన పరిస్థితే ఉంది. రాముడు వనవాసానికి వెళ్లినప్పుడు.. భరతుడు పాలించాల్సి వచ్చింది. సింహాసనంపై రాముడి పాదుకలు ఉంచి రాజ్యాన్ని ఏలాడు. ఈ కుర్చీ అరవింద్ కేజ్రీవాల్‌ది. నాలుగు నెలల తర్వాత జరిగే ఎన్నికల్లో ఢిల్లీలో మళ్లీ ఆయన అధికారాన్ని చేపడతారని విశ్వసిస్తున్నాను. ఆయన తిరిగివచ్చేవరకు ఈ కుర్చీ ఇక్కడే ఉంటుంది” అని ఆతిశీ అన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement