Thursday, September 19, 2024

Delhi | సీఎం రేవంత్ ని కలిసిన ఢిల్లీ తెలుగు జర్నలిస్టులు..

ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంతరెడ్డిని ఢిల్లీకి చెందిన తెలుగు జర్నలిస్టులు (గురువారం) న్యూఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలకు సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ జర్నలిస్టుల బృందం కృతజ్ఞతలు తెలిపింది. సీఎంతో జరిగిన ఆత్మీయ సమావేశంలో జర్నలిస్టుల ఇళ్లు, హెల్త్‌కార్డులు, అక్రిడేషన్‌పై చర్చించారు. ముఖ్యంగా మీడియా అకాడమీకి రూ.10 కోట్లు ప్రకటించడం పట్ల జర్నలిస్టుల ప్రతినిధి బృందం హర్షం వ్యక్తం చేసింది.

జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం పునరుద్ఘాటించారు. జర్నలిస్టుల సంక్షేమం, భద్రతకు తగిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. వ్యవస్థకు జర్నలిస్టులే కీలకమని, బాధ్యతాయుతమైన రిపోర్టింగ్‌కు త‌మ‌ సహకారం ఎప్పుడూ ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement