Thursday, September 19, 2024

Delhi – ఆగస్టు 2, 3 తేదీల్లో గవర్నర్ల సదస్సు

*న్యూఢిల్లీ – ఆగస్టు 2, 3 తేదీల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధ్యక్షతన గవర్నర్ల సదస్సు జరగనుంది. రెండ్రోజుల పాటు జరగనున్న ఈ సదస్సుకు ఉపరాష్ట్రపతి జగ్ దీప్ ధన్ కర్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు, నీతి ఆయోగ్ సీఈవో, హోంశాఖ, ఇతర కీలక శాఖల ఉన్నతాధికారులు కూడా హాజరుకానున్నారు.

నేర, న్యాయ చట్టాలు, ఉన్నత విద్యలో సంస్కరణలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. గిరిజన ప్రాంతాలు, వెనుకబడిన జిల్లాలు, సరిహద్దు ప్రాంతాల అభివృద్ధి, మై భారత్, ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్, ఏక్ వృక్ష్ మాకే నామ్ అంశాలపై చర్చిస్తారు.

సేంద్రియ వ్యవసాయం, ప్రజా సంబంధాల మెరుగుదల, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలతో సమన్వయం తదితర అంశాలపై అవగాహన కలిగించనున్నారు. ఈ సదస్సులో గవర్నర్లు బృందాలుగా విడిపోయి కీలక అంశాలపై చర్చించనున్నారు. అజెండాలోని అంశాలపై ఉన్నతాధికారులు ప్రజెంటేషన్ ద్వారా వివరాలు అందించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement