Thursday, September 19, 2024

Delhi – రేపే లెఫ్ట్‌నెంట్ గవర్నర్ తో కేజ్రీవాల్ భేటి….

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మంగళవారం తన పదవికి రాజీనామా చేయనున్నారు. లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే.సక్సేనా అపాయింట్‌మెంట్ ఇచ్చారు. మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు వీకే.సక్సేనాను కేజ్రీవాల్ కలిసి తన పదవికి రాజీనామా చేయనున్నారు. దీంతో తదుపరి ముఖ్యమంత్రి ఎవరంటూ సర్వత్రా చర్చ నడుస్తోంది. అయితే ప్రముఖంగా ఆమ్ ఆద్మీ పార్టీలో కీ రోల్ పోషించిన పేర్లు వినిస్తున్నాయి.

సీఎం రేసులో ప్రధానంగా సునీతా కేజ్రీవాల్, రాఘవ్ చద్దా, అతిషి, సౌరభ్ భరద్వాజ్ పేర్లు ప్రముఖంగా వినిస్తున్నాయి. వీరితో పాటు పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ నలుగురిలో ఎవరికొకరికి అవకాశం దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోసారి అధికారంలోకి రావాలంటే చాలా కీలకంగా వ్యవహారించాలి. దీంతో కేజ్రీవాల్ ఆచూతూచి అడుగులు వేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement