Tuesday, October 8, 2024

Delhi: కేంద్ర మంత్రి గడ్కరీతో చంద్రబాబు భేటీ


ఢిల్లీ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఢిల్లీలో రెండో రోజు కొనసాగుతోంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చంద్రబాబు భేటీ అయ్యారు. అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు, జాతీయ రహదారుల అభివృద్ధి తదితర అంశాలపై చర్చిస్తున్నారు. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్, హర్దీప్ సింగ్ పూరీలతో కూడా చంద్రబాబు భేటీ కానున్నారు.

ఈ సమావేశంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, టీడీపీ ఎంపీలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఏపీలోని జాతీయ రహదారులపై చర్చించనున్నారు. ఏపీలోని అన్ని జిల్లాల నుంచి అమరావతికి కనెక్టివిటీ, అమరావతి-హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ వే పై చర్చించనున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement