Thursday, July 4, 2024

Delhi – కూలిన ఢిల్లీ ఎయిర్ పోర్ట్ టెర్మినల్ రూఫ్ – ఒకరి మృతి

దేశ రాజధాని ఢిల్లీ నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం. దీంతో రోడ్లన్ని కూడా జలయమయ్యాయి. ఈ క్రమంలోనే భారీగా వరద నీరు రావడంతో లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు నిలిచిపోయాయి. చాలా కార్లు నీళ్లలో కొట్టుకుపోయాయి.భారీ వర్షాలు కురుస్తుడండంతో ఇందిరా గాంధీ ఎయిర్‌పోర్ట్‌ లోని టెర్మినల్‌ 1 లో పై కప్పు కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించారు. పలువురు గాయపడ్డారు ..వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వివరించారు.సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.ఈ ప్రమాదంలో పైకప్పు కింది పార్క్ చేసిన అనేక వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి.

- Advertisement -

మరోవైపు టెర్మినల్‌-1 నుంచి బయలుదేరే అన్ని విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు విమానాశ్రయ అధికారులు ప్రకటించారు.

స్వయంగా పర్యవేక్షిస్తున్నా: కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు

దిల్లీ విమానాశ్రయంలో పైకప్పు కూలిన సంఘటనను స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. టెర్మినల్‌-1 వద్ద ప్రయాణికులందరికీ తగిన ఏర్పాట్లు చేయాలని చేయాలని విమానయాన సంస్థలకు సూచించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement