Tuesday, September 17, 2024

Archery Olympics | సెమీస్ లో ఓట‌మి.. కాంస్యం కోసం పోరాటం

పారిస్ ఒలింపిక్స్‌లో భాగంగా ఈరోజు జరిగిన ఆర్చరీ సెమీ ఫైనల్స్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో భారత జోడీ ఓడిపోయింది. దక్షిణ కొరియా ద్వయం లిమ్ సిహ్యోన్, కిమ్ వూజిన్‌తో తలపడిన ధీరజ్, అంకితా భకత్ 6-2 పాయింట్ల తేడాతో ఓడిపోయారు. మొత్తం నాలుగు సెట్లలో తొలి సెట్ గెలిచిన భారత్ రెండు పాయింట్లు సాధించింది.

అయితే ఆ తర్వాత వ‌రుస‌గా మూడు సెట్ల‌లో గెలిచి దక్షిణ కొరియా 6 పాయింట్లు సాధించింది. దీంతో భారత జోడీ 2-6తో ఓడిపోయింది. దీంతో ధీరజ్-అంకిత జోడీ క్యాంస ప‌త‌కం కోసం అమెరికాతో పోరాడనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement