Thursday, October 24, 2024

దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు…కొత్తగా ఎన్నో తెలుసా ?

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గ‌డిచిన 24గంట‌ల్లో కొత్తగా 1,74,000 కొత్త కేసులు నమోదు అయ్యాయి. అలాగే మ‌రోవైపు 3,563 మంది క‌రోనాతో మృతిచెందారు.. ఇదే స‌మ‌యంలో 2,84,601 మంది క‌రోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు..కాగా తాజా గణాంకాల ప్రకారం మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,77,19,431కు చేరుకోగా 3,18,821 మంది మృతి చెందారు.

గత 24 గంటల్లో న‌మోదైన పాజిటివ్ కేసుల్లో తమిళనాడు లో 31,079 , కర్ణాటకలో 22,823 కొత్త కేసులు, కేరళలో 22,318 కేసులు, మహారాష్ట్రలో 20,740, ఆంధ్రప్రదేశ్‌లో 14,429 కేసులు, పశ్చిమ బెంగాల్‌లో 12,193 కేసులు నమోదు అయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement